180 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం: ఒమన్

- April 29, 2022 , by Maagulf
180 కిలోల ఆహార పదార్థాలు ధ్వంసం: ఒమన్

ఒమన్ : సీబ్‌లోని విలాయత్‌లో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 180 కిలోల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఆరోగ్య శాఖ నిబంధనలు ఉల్లంఘించిన 28 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. సీబ్‌లోని మస్కట్ మునిసిపాలిటీకి చెందిన ఫుడ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ మొత్తం 1,029 తనిఖీలను నిర్వహించింది. ఇందులో పురుషుల బార్బర్ దుకాణాలతో పాటు మాంసం, స్వీట్లు, గింజలు, ఒమానీ స్వీట్లు విక్రయించే దుకాణాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com