కేఏ పాల్ పై దాడి

- May 02, 2022 , by Maagulf
కేఏ పాల్ పై దాడి

తెలంగాణ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ పై చేశారు. ఆ సమయంలో ఆయనపై దాడి చేశారు. సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దు ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.

ఏకంగా డీఎస్పీ ముందే కేఏ పాల్ పై కార్యకర్త చేయి చేసుకున్నారు.జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి కేఏ పాల్ పై దాడి చేశాడని తెలుస్తోంది.దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తేనని కేఏ పాల్ చెబుతున్నారు.రైతులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు.వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందకు కేఏ పాల్ వెళ్లారు.

దీంతో పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆర్డర్ చూపిస్తేనే వెనక్కి వెళ్తానంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com