రోడ్ సేఫ్టీ వీక్: పోస్టర్లతో బహుమతులు గెలుచుకునే అవకాశం
- May 04, 2022కువైట్: మే 15 నుంచి 22 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవం నేపథ్యంలో పోస్టర్ తయారీ పోటీల్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కువైట్లోని ఇండియన్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఇండియన్స్ ఇన్ కువైట్ డాట్ కామ్ అలాగే అల్ మైలెమ్ గ్రూప్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలో విజేతలుగా నిలిచినవారికి 115 కువైటీ దినార్ల విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుంది. మొదటి బహుమతి విజేతకు 50 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. రెండో బహుమతి విజేతకు 40 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. మూడో బహుమతి విజేతకు 25 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుంది.అల్ మైలెమ్ గ్రూప్ ఈ బహుమతుల్ని అందించనుంది. రోడ్డు భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ పోటీల ఉద్దేశ్యం. మే 10లోపు ఫొటోలను పంపించాల్సి వుంటుంది. 15 మే నుంచి సోషల్ మీడియాలో ఎంపిక చేసిన పోస్టర్లు పోస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..