డ్రైవింగ్: ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరం
- April 05, 2016
డ్రైవింగ్ సమయంలో ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరమని వివిధ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాయల్ ఒమన్ పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించారు. ఆల్కహాల్ సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారికన్నా డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం దారులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపేవారికి 35 ఒమన్ రియాల్స్ ఫైన్ విధిస్తున్నారు. దీన్ని 300 ఒమన్ రియాల్స్కి పెంచడంతోపాటు నెల రోజుల నుంచి 2 ఏళ్ళ జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేయడం కుదరదనీ, ప్రమాదాల నివారణకు చైతన్యం పెంచడమే మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







