నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణం : అమెరికా
- April 06, 2016అమెరికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ విశ్వవిద్యాలయం కుంభకోణంలో 10 మంది ప్రవాస భారతీయులు నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉండటం గమనార్హం. వారిని తేజేష్ కొడాలి, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టిగా గుర్తించారు.అసలేం జరిగిందంటే... ఉత్తర న్యూజెర్సీ యూనివర్శిటీ భోగస్దని... దానిలో ఎలాంటి తరగతులు జరగడం లేదని వెలుగులోకి వచ్చింది. అయితే దీని పేరుతో వెయ్యి మందికి పైగా విదేశీయులు వీసాలు పొంది అమెరికాకు వచ్చినట్లు తేలింది.ముఖ్యంగా భారత్, చైనాల నుంచే వీరు వలసేతర విద్యార్థి వీసాలతో వచ్చినట్లు బయటపడింది. ఈ కుంభకోణానికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో ఏకంగా పది మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాల్లో ఉంటున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం