కాస్ట్ కటింగ్: ఖజానా సర్దుబాటు
- June 12, 2015
మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఇక నుంచి తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ట్రావెల్ని ఇకపై అన్ని సందర్భాల్లోనూ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనసవరపు ఖర్చుల్ని తగ్గించడం ద్వారా ఖజానాపై పడే భారాన్ని తగ్గించవ్చని ప్రభుత్వం భావిస్తోంది. షురా కౌన్సిల్ ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ ఖలీద్ అల్ మస్కటీ ఈ మేరకు పొదుపు చర్యల్ని ప్రకటించారు. ఎంపీలు, మంత్రులు ఓ అవగాహనకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారాయన. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా మిలియన్స్ ఆఫ్ దినార్స్ని జాగ్రత్త చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. షురా కౌన్సిల్ ఛైర్మన్ అలీ సలేప్ా అల్ సలేప్ా మాట్లాడుతూ, సబ్సిడీల కోత కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా మారుతుందని చెప్పారు. సబ్సిడీల కోత ఇబ్బందికరమే అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







