షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి
- May 15, 2022
నూతన అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తో భేటీ అయిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున నేడు అబుధాబిలో నివాళులు అర్పించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
యూఏఈ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను అబుధాబిలోని ముష్రిఫ్ ప్యాలెస్లో కలిసి సంతాపం తెలియజేయడంతోపాటు పదవి చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ "భారత్-యూఏఈ మధ్య సత్సంబంధాలకు మరియు యూఏఈ లో నివసిస్తున్న భారతీయుల క్షేమానికి షేక్ ఖలీఫా చూపిన చొరవ మరువరానిది.భారత్ కు యూఏఈ ఎంతో సన్నిహిత మిత్రుడు" అని ఖలీఫా తో ఆయనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.
షేక్ మొహమ్మద్ నేతృత్వంలో భారత్-యూఏఈ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు భారత్ ఉపరాష్ట్రపతి.
ఉపరాష్ట్రపతి తోపాటు యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, ఉపరాష్ట్రపతి సెక్రటరీ డా.ఐ.వి సుబ్బా రావు, జాయింట్ సెక్రటరీ (గల్ఫ్) విపుల్ మరియు ఇతర భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు.
ఇక, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









