భారత్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర
- May 23, 2022
న్యూఢిల్లీ: భారత్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది.
దేశంలోని పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్లను లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారీ కుట్ర పన్నిందని హెచ్చరికలు జారీ చేశాయి.
పంజాబ్తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చివేయాలని ఐఎస్ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది. సరుకు రవాణా రైళ్లు ఢీకొట్టేందుకు రైల్వే ట్రాక్లను పేల్చివేయటానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా సంస్థలు తెలిపాయి.
రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. భారత్లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







