'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
- May 23, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మే 24 నుంచి ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ పేరుతో సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. బుక్ మై షోలో ప్రీరిలీజ్ టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయని తెలిపారు. సాధారణంగా ప్రీరిలీజ్ స్క్రీనింగ్ అంటే ఒకటి, రెండు రోజుల ముందు నుంచి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో పది రోజులు ముందుగానే స్క్రీనింగ్ చేయబోతున్నారు.
ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.
Namaste India. We are coming to you with our film, 10 days in advance.#Major Pre release Film Screenings across India from May 24th 💥💥
— Major (@MajorTheFilm) May 23, 2022
Stay tuned to @bookmyshow to book tickets in your cities for the exclusive screening of #MajorTheFilm.#MajorOnJune3rd pic.twitter.com/wOQky6MWMN
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







