ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభం

- May 27, 2022 , by Maagulf
ఒంగోలులో  మహానాడు కార్యక్రమం ప్రారంభం

అమరావతి: నేడు ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయ్యింది. టీడీపీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆశీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు.

మరోవైపు, పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ 40 వసంతాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికపైనే అని తెలిపారు. తాను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని అన్నారు. తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com