హజ్ 2022.. ప్రవాసులకు మక్కా ప్రవేశం నిషేధం
- May 27, 2022
మక్కా: అనుమతులు లేని ప్రవాసులకు మక్కా ప్రవేశ నిషేధం గురువారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రను క్రమబద్ధీకరించడానికి సంబంధించిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్ సమీ అల్-షువైరెఖ్ తెలిపారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్ 25 గురువారం నుండి పవిత్ర నగరంలోకి అనుమతించబడతారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్నవారు మక్కా ప్రవేశ కేంద్రాల వద్ద ఉన్న భద్రతా నియంత్రణ కేంద్రాల నుండి అనుమతులు పొందవచ్చని తెలిపారు. అవసరమైన పత్రాలు లేని అన్ని వాహనాలు, నివాసితులను వెనక్కి తిప్పిపంపుతామన్నారు. పవిత్ర ప్రదేశాలలో పని చేయడానికి ఎంట్రీ పర్మిట్, మక్కా నుండి జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా), ఉమ్రా పర్మిట్ ఉన్నవారికి మాత్రమే మక్కాలోకి అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









