హజ్ 2022.. ప్రవాసులకు మక్కా ప్రవేశం నిషేధం
- May 27, 2022
మక్కా: అనుమతులు లేని ప్రవాసులకు మక్కా ప్రవేశ నిషేధం గురువారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్రను క్రమబద్ధీకరించడానికి సంబంధించిన సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ప్రతినిధి జనరల్ సమీ అల్-షువైరెఖ్ తెలిపారు. మక్కా ప్రవేశానికి అనుమతి పొందిన ప్రవాసులు మాత్రమే మే 26కి సంబంధించిన షవ్వాల్ 25 గురువారం నుండి పవిత్ర నగరంలోకి అనుమతించబడతారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్నవారు మక్కా ప్రవేశ కేంద్రాల వద్ద ఉన్న భద్రతా నియంత్రణ కేంద్రాల నుండి అనుమతులు పొందవచ్చని తెలిపారు. అవసరమైన పత్రాలు లేని అన్ని వాహనాలు, నివాసితులను వెనక్కి తిప్పిపంపుతామన్నారు. పవిత్ర ప్రదేశాలలో పని చేయడానికి ఎంట్రీ పర్మిట్, మక్కా నుండి జారీ చేయబడిన రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా), ఉమ్రా పర్మిట్ ఉన్నవారికి మాత్రమే మక్కాలోకి అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







