బావిలో పడ్డ పౌరుడుని రక్షించిన సీడీఏఏ
- May 27, 2022
మస్కట్: సౌత్ షర్కియా గవర్నరేట్లోని సూర్లో బావిలో పడిపోయిన ఒక పౌరుడిని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) రక్షించింది. మోస్తరు గాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌత్ షర్కియా గవర్నరేట్లోని సుర్లోని విలాయత్లోని తైమా ప్రాంతంలోని బావిలో ఓ పౌరుడు పడిపోయాడని సమాచారం అందడంతో రెస్క్యూ టీమ్లు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని రక్షించినట్లు సీడీఏఏ వెల్లడించింది. మోస్తరు గాయాలైన అతనికి అత్యవసర వైద్య సహాయాన్ని అందించేందుకు ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. పూడ్చివేయని బావుల పట్ల పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని సీడీఏఏ సూచించింది.
తాజా వార్తలు
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు









