కేసీఆర్ బెంగళూరు పర్యటన ముచ్చట్లు

- May 27, 2022 , by Maagulf
కేసీఆర్ బెంగళూరు పర్యటన ముచ్చట్లు

బెంగళూరు: సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్లి వచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, కచ్చితమైన మార్పు ఉంటుందని, అది ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. వచ్చి కొన్ని నెలల్లో ఒక సంచలన వార్తను చెబుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఎంతమందో ప్రధానులు వచ్చారని, కానీ దేశ పరిస్థితులు మాత్రం ఎంతమాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. వెనుకబడిన చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని, మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com