మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు రాచకొండ పోలీసు
- June 03, 2022
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 8.2 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాటి విలువ సుమారు 30 లక్షల 29 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాచకొండ ఎస్వోటి, మీర్ పేట్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో రాజస్థాన్ కు చెందిన పరాస్మల్ అనే వ్యక్తిని హైదరబాద్ లో అరెస్ట్ చేసారు. అతని వద్ద నుంచి 1కేజీ ఓపియం డ్రగ్స్, 5.2 కేజీ పొప్పి స్ట్రావ్ , 2 కేజీల పొప్పి స్ట్రావ్ పౌడర్తో పాటు 19 వేల రూపాయల నగదు, ప్యాకింగ్ కవర్లు, ఒకబైక్ స్వాధీనం చేసుకున్నారు.
పరాస్మల్ ఒక కేజీ ఓపియంను మధ్యప్రదేశ్ లో 30 వేలకు కొనుగోలు చేసి ఇక్కడ 10 లక్షలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దీపక్ అనే డ్రగ్స్ పెడ్లర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ ను నిరోధించేందుకు రాష్ట్రంలో నిరంతరం సోదాలు చేస్తూనే ఉంటామని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా వినియోగించినా ఎవరినీ వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు.

తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







