కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ హీరోయిన్.!
- June 18, 2022
‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు రీమా సేన్. ఈ సినిమాతో యూత్కి బాగా కనెక్ట్ అయిపోయిందీ అందాల భామ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రీమా సేన్.
యంగ్ హీరోలతో పాటు, మాస్ రాజా రవితేజ వంటి ఓ మోస్తరు స్టార్ హీరోల సరసన కూడా నటించిన రీమాసేన్, మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లోనూ నటించి, మెప్పించింది.
అయితే, ఇప్పుడు రీమా సేన్ ఏం చేస్తున్నట్లు.? సినిమాలకు బ్రేకిచ్చేసి, పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె భర్త ఓ పెద్ద బిజినెస్ మేన్. పేరు శివ్ కరణ్ సింగ్. పెళ్లి తర్వాత రీమా సేన్ కూడా భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోందట.
ఫుడ్ బిజినెస్లో దాదాపు రెండు దశాబ్ధాల అనుభవం వుందట శివ్ కరణ్ సింగ్కి. ఆ అనుభవంతోనే చాలా చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేశారట. తాజాగా గోవాలో సరికొత్త ఫుడ్ బిజినెస్కి శ్రీకారం చుట్టబోతున్నారట రీమాసేన్ దంపతులు. ఆలోచన వచ్చిందే తడవుగా, ఓ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారట.
‘సుక్కా’ అనే పేరుతో ఓపెన్ అయిన ఆ రెస్టారెంట్లో మెనూ దగ్గర్నించి, ఇంటీరియర్ యాంబియెన్స్ అంతా రీమా సేనే సొంతంగా డిజైన్ చేసిందట. అంతేకాదు, గోవాలోని రెస్టారెంట్లన్నింట్లోనూ ఈ రెస్టారెంట్ చాలా చాలా ప్రత్యేకంగా వుండబోతోందని రీమా సేన్ చెబుతోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







