కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ హీరోయిన్.!

- June 18, 2022 , by Maagulf
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ హీరోయిన్.!

‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు రీమా సేన్. ఈ సినిమాతో యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయిందీ అందాల భామ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రీమా సేన్.

యంగ్ హీరోలతో పాటు, మాస్ రాజా రవితేజ వంటి ఓ మోస్తరు స్టార్ హీరోల సరసన కూడా నటించిన రీమాసేన్,  మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నటించి, మెప్పించింది.

అయితే, ఇప్పుడు రీమా సేన్ ఏం చేస్తున్నట్లు.? సినిమాలకు బ్రేకిచ్చేసి, పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె భర్త  ఓ పెద్ద బిజినెస్ మేన్. పేరు శివ్ కరణ్ సింగ్. పెళ్లి తర్వాత రీమా సేన్ కూడా భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోందట.
ఫుడ్ బిజినెస్‌లో దాదాపు రెండు దశాబ్ధాల అనుభవం వుందట శివ్ కరణ్ ‌సింగ్‌కి. ఆ అనుభవంతోనే చాలా చోట్ల బ్రాంచ్‌లు ఓపెన్ చేశారట. తాజాగా గోవాలో సరికొత్త ఫుడ్ బిజినెస్‌కి శ్రీకారం చుట్టబోతున్నారట రీమాసేన్ దంపతులు. ఆలోచన వచ్చిందే తడవుగా, ఓ రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశారట.

‘సుక్కా’ అనే పేరుతో ఓపెన్ అయిన ఆ రెస్టారెంట్‌లో మెనూ దగ్గర్నించి, ఇంటీరియర్ యాంబియెన్స్ అంతా రీమా సేనే సొంతంగా డిజైన్ చేసిందట. అంతేకాదు, గోవాలోని రెస్టారెంట్లన్నింట్లోనూ ఈ రెస్టారెంట్ చాలా చాలా ప్రత్యేకంగా వుండబోతోందని రీమా సేన్ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com