కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ హీరోయిన్.!
- June 18, 2022
‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు రీమా సేన్. ఈ సినిమాతో యూత్కి బాగా కనెక్ట్ అయిపోయిందీ అందాల భామ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రీమా సేన్.
యంగ్ హీరోలతో పాటు, మాస్ రాజా రవితేజ వంటి ఓ మోస్తరు స్టార్ హీరోల సరసన కూడా నటించిన రీమాసేన్, మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లోనూ నటించి, మెప్పించింది.
అయితే, ఇప్పుడు రీమా సేన్ ఏం చేస్తున్నట్లు.? సినిమాలకు బ్రేకిచ్చేసి, పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె భర్త ఓ పెద్ద బిజినెస్ మేన్. పేరు శివ్ కరణ్ సింగ్. పెళ్లి తర్వాత రీమా సేన్ కూడా భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోందట.
ఫుడ్ బిజినెస్లో దాదాపు రెండు దశాబ్ధాల అనుభవం వుందట శివ్ కరణ్ సింగ్కి. ఆ అనుభవంతోనే చాలా చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేశారట. తాజాగా గోవాలో సరికొత్త ఫుడ్ బిజినెస్కి శ్రీకారం చుట్టబోతున్నారట రీమాసేన్ దంపతులు. ఆలోచన వచ్చిందే తడవుగా, ఓ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారట.
‘సుక్కా’ అనే పేరుతో ఓపెన్ అయిన ఆ రెస్టారెంట్లో మెనూ దగ్గర్నించి, ఇంటీరియర్ యాంబియెన్స్ అంతా రీమా సేనే సొంతంగా డిజైన్ చేసిందట. అంతేకాదు, గోవాలోని రెస్టారెంట్లన్నింట్లోనూ ఈ రెస్టారెంట్ చాలా చాలా ప్రత్యేకంగా వుండబోతోందని రీమా సేన్ చెబుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







