సరికొత్త అవతారమెత్తబోతున్న ‘డీజే టిల్లు’
- June 18, 2022
అంతవరకూ చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డీజె టిల్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనూహ్యంగా ఈ సినిమాతో స్టార్ అయిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సిద్దు స్టామినాకి మించి కలెక్షన్లు కురిపించింది.
దాంతో మనోడి కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగిపోయాయ్. బాక్సాఫీస్కి కాసుల పంట ఓ ఎత్తయితే, ఈ సినిమా యూత్లో క్రియేట్ చేసిన ట్రెండింగ్ అంతా ఇంతా కాదు. నిజంగానే టిల్లు క్యారెక్టర్లో సిద్దు అదరగొట్టేశాడు. ఆయన నటనను క్రిటిక్స్ సైతం మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
ఆ రేంజ్లో ట్రెండింగ్ అయిన ‘డీజె టిల్లు’కి సీక్వెల్ రూపొందించే పనిలో ప్రస్తుతం సిద్దు జొన్నల గడ్డ బిజీగా వున్నాడు. ‘డీజె టిల్లు’ క్లైమాక్స్ సీన్ని సీక్వెల్ ప్లానింగ్ కోసమే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా వదిలి పెట్టిన సంగతి సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది.
హీరోయిన్ మోసం చేయడంతో, ఆమెకి హ్యాండిచ్చేసి, విదేశాల్లో అందమైన అమ్మాయిలతో హాయిగా ఎంజాయ్ చేసే డీజె టిల్లు సెకండ్ పార్ట్లో మళ్లీ డీజె ఉద్యోగం చేస్తాడట. ఎందుకు.? ఎలా.? అనేది సీక్వెల్ వచ్చాకే తెలుస్తుంది.
ఇకపోతే, అసలు విషయానికి వచ్చేస్తే, మన డీజె టిల్లు, ఇక్కడితో ఆగేలా లేడు. నటుడిగా తనలో దాగున్న మరో యాంగిల్ బయటికి తీయబోతున్నాడట. అదే విలనిజం. అవునండీ సీరియస్ విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడట డీజె టిల్లు అలియాస్ సిద్దు. ఇంతకీ ఏంటా సినిమా.? అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయట.కానీ, సిద్ధు విలన్గా నటించబోతున్నాడన్న విషయం మాత్రం నిజ్జంగా నిజమే.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







