రాహుల్గాంధీ ఈరోజు కేరళకు...
- April 10, 2016
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్ ఆలయ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. మృతులకు నివాళులర్పించి, క్షతగాత్రుల కుటుంబాలతో రాహుల్ మాట్లాడనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీలు కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 13 ఆస్పత్రుల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో వందకు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోగా, 300కి పైగా గాయపడ్డారు. మృతులకు పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









