రాహుల్‌గాంధీ ఈరోజు కేరళకు...

- April 10, 2016 , by Maagulf
రాహుల్‌గాంధీ ఈరోజు కేరళకు...

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్‌ ఆలయ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. మృతులకు నివాళులర్పించి, క్షతగాత్రుల కుటుంబాలతో రాహుల్‌ మాట్లాడనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ప్రకటించారు.కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 13 ఆస్పత్రుల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో వందకు పైగా భక్తులు ప్రాణాలు కోల్పోగా, 300కి పైగా గాయపడ్డారు. మృతులకు పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com