హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ
- June 20, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం సోనియా కరోనా బారినపడడంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సోనియా గాంధీ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం తో ఆమెను ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంచార్జ్ జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనియారు కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు.
నెషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్కు ఈడీ కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల సోనియా ఈ విచారణకు హాజరుకాలేనని తెలిపారు. దీంతో జూన్ 23న విచారణకు హాజరయ్యేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం సోమవారంతో కలిపి మొత్తం నాలుగు రోజులు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం రాహుల్ ఈడీ విచారణ ముగిసింది. రేపు కూడా ఈడీ ఆఫీస్ కు రావాలని తెలిపారు. మరోపక్క ఈడీ సమన్ల ఫై గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ వస్తుంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







