48 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్: సౌదీ
- June 29, 2022
సౌదీ: అనేక ఆరోపణలపై 171 మంది ప్రభుత్వ ఉద్యోగులను విచారించి.. వారిలో 48 మందిని క్రిమినల్ ప్రొసీజర్ చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియాకు చెందిన ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. AH 1443 ధుల్-ఖదా నెలలో అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను ప్రారంభించినట్లు నజాహా పేర్కొంది. అధికార దుర్వినియోగం, లంచం, మనీ లాండరింగ్, ఫోర్జరీ వంటి అనేక ఆరోపణలపై 4,672 మానిటరింగ్ రౌండ్లను నిర్వహించి అనేక మందిని విచారించి కొందరిని అరెస్టు చేశామని అథారిటీ తెలిపింది. అరెస్టయిన వారిలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను- కస్టమ్స్ అథారిటీలకు చెందిన వారున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







