భారత్లో లక్ష దాటిన కరోనా కేసులు..
- June 30, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో భారీగా పెరిగిన కేసులు లక్ష సంఖ్యను దాటేశాయి. మంగళవారం కేసుల సంఖ్య 14వేల 506గా ఉండగా 30 మరణాలు సంభవించాయి. బుధవారం 18వేల 819కేసులు నమోదై 39మరణాలు వాటిల్లాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 4వేల 555కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.16 శాతానికి చేరగా.. దేశ జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.24 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 52వేల 164కేసులు నమోదుకాగా 5లక్షల 25వేల 116 మరణాలు సంభవించినట్లు సమాచారం.
కరోనా రికవరీ రేటు దేశంలో 98.55 శాతంగా ఉండగా.. బుధవారం ఒక్కరోజే 13వేల 827 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 28లక్షల 22వేల 493 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 531 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.51 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 51లక్షల 46వేల 587 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







