భారత్లో లక్ష దాటిన కరోనా కేసులు..
- June 30, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో భారీగా పెరిగిన కేసులు లక్ష సంఖ్యను దాటేశాయి. మంగళవారం కేసుల సంఖ్య 14వేల 506గా ఉండగా 30 మరణాలు సంభవించాయి. బుధవారం 18వేల 819కేసులు నమోదై 39మరణాలు వాటిల్లాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 4వేల 555కు చేరాయి. రోజువారీ పాజిటివిటి రేటు 4.16 శాతానికి చేరగా.. దేశ జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.24 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34లక్షల 52వేల 164కేసులు నమోదుకాగా 5లక్షల 25వేల 116 మరణాలు సంభవించినట్లు సమాచారం.
కరోనా రికవరీ రేటు దేశంలో 98.55 శాతంగా ఉండగా.. బుధవారం ఒక్కరోజే 13వేల 827 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4కోట్ల 28లక్షల 22వేల 493 మందిగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 531 రోజులకు చేరింది. ఇప్పటివరకు 197.51 కోట్ల డోసుల టీకాలు అందజేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 197కోట్ల 51లక్షల 46వేల 587 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







