సాంగ్ రిలీజ్కి కూడా ఈవెంటా.? ఇదెక్కడి చోద్యం గురూ.!
- July 06, 2022
జరుగుబడి వుంటే, జ్వరం ఎంత మజాగా వుంటుందోనట. అలాగే వుంది సినిమా ఈవెంట్ల పరిస్థితి. ఒక్క సినిమా ఫంక్షన్ చేయాలంటేనే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది జస్ట్ సాంగ్ రిలీజ్ కోసం కూడా ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారీ హీరోగారు.
ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా కథ.? అంటారా.. హీరో నితిన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’ . కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఆ సాంగ్ రిలీజ్ కోసం శ్రీకాకుళంలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ‘మాస్ మ్యూజిక్ జాతర’ అంటూ ఆ ఈవెంట్కి ఓ పేరు కూడా పెట్టేశారు. జూలై 9న ఈ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేశారు.
‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ..’ అంటూ సాగే ఈ పాటలో తెలుగమ్మాయ్ అంజలి, నితిన్తో కలిసి మాస్ స్టెప్పులిరగదీసింది. ఈ పాట సినిమాకి చాలా పెద్ద హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.
కాగా, సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఎంత సొంత బ్యానర్ అయితే మాత్రం స్పెషల్ సాంగ్ రిలీజ్ కోసం స్పెషల్ ఈవెంట్ ఏంటీ బాస్.. అంటూ నితిన్ని ట్రోల్ చేస్తున్నారు. అంతేగా మరి.
తాజా వార్తలు
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







