పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్

- July 10, 2022 , by Maagulf
పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్

మనామా: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులను హెచ్చరించింది. అలాగే శ్రీలంకలో ఉన్న పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.  అశాంతి ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు భద్రత కోసం స్థానిక అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ పౌరులకు సూచించింది. అత్యవసర సమయాల్లో భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని 00919654132318, 00917303061130 లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 0097317227555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com