అంతర్జాతీయ భారత మహిళ అవార్డు ఐశ్వర్యరాయ్కి..
- April 12, 2016
పనామా పేపర్స్ వివాదంలో చిక్కుకుని సతమతమవుతున్న తరుణంలో బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఇది సంతోషకరమైన వార్త. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ భారత మహిళ అవార్డు లభించింది. ముంబాయ్లో జరిగిన ప్రవాసీ భారతీయుల అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఐష్ 'గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేసింది 42 సంవత్సరాల ఐశ్వర్య. ఐష్తో పాటు ప్రముఖ టన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ప్రత్యేక అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళ ఉన్నతిని పెంచేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపింది ఐష్. మొదటి నుంచి కూడా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని అలానే ఉపయోగించిన తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక గుర్తింపుతో పాటు పలు అవకాశాలు లభించాయని గుర్తు చేసుకున్నారామె. ఈ ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రధానోత్సవంలో మొత్తం 17 మంది వ్యక్తిగతంగా అవార్డులు స్వీకరించారు. అందులో వృత్తి, కళ, సంప్రదాయం, స్పెషల్ జ్యూరీ, గ్లోబల్ ఐకాన్, వ్యాపారం ఇలా పలు అంశాల వారీగా అవార్డులు ఇవ్వబడ్డాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









