భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- July 20, 2022
న్యూ ఢిల్లీ: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతోంది.ఈ నేపథ్యంలోనే కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్య దాడి జరిగింది.ఈ దాడిలో భారత ప్రభుత్వాధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీలంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులకు పలు సూచనలు చేసింది.దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను పరామర్శించినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఇండియన్ ఎంబసీ.. గత రాత్రి కొలంబో సమీపంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది.ఈ ఘటన గురించి శ్రీలంక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పింది.లంకలో తాజా పరిణామాల పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాకపోకలు సాగించాలని అక్కడి భారత పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









