భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- July 20, 2022
న్యూ ఢిల్లీ: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతోంది.ఈ నేపథ్యంలోనే కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్య దాడి జరిగింది.ఈ దాడిలో భారత ప్రభుత్వాధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీలంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులకు పలు సూచనలు చేసింది.దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను పరామర్శించినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఇండియన్ ఎంబసీ.. గత రాత్రి కొలంబో సమీపంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది.ఈ ఘటన గురించి శ్రీలంక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పింది.లంకలో తాజా పరిణామాల పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాకపోకలు సాగించాలని అక్కడి భారత పౌరులకు సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









