విదేశీ రిక్రూట్మెంట్ నిబంధనలు కఠినం.. సంస్థలకు జరిమానా, జైలుశిక్ష
- July 25, 2022
రియాద్: విదేశీ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా నియమించుకున్న లేదా తమ ఉద్యోగులను ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించే కంపెనీలు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. నిబంధనలు పాటించిన సంస్థలకు SR10,000 వరకు జరిమానాతోపాటు ఐదు సంవత్సరాల వరకు రిక్రూట్మెంట్పై నిషేధం, అలాగే వారి స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ప్రకటనలు ఇయ్యాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతోపాటు సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, ప్రవాసుడు అయితే సౌదీ అరేబియా నుండి బహిష్కరించబడతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా రెసిడెన్సీ, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను తెలిపాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







