విదేశీ రిక్రూట్మెంట్ నిబంధనలు కఠినం.. సంస్థలకు జరిమానా, జైలుశిక్ష
- July 25, 2022
రియాద్: విదేశీ ఉద్యోగులను చట్టవిరుద్ధంగా నియమించుకున్న లేదా తమ ఉద్యోగులను ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించే కంపెనీలు భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. నిబంధనలు పాటించిన సంస్థలకు SR10,000 వరకు జరిమానాతోపాటు ఐదు సంవత్సరాల వరకు రిక్రూట్మెంట్పై నిషేధం, అలాగే వారి స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ప్రకటనలు ఇయ్యాల్సి ఉంటుందని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతోపాటు సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, ప్రవాసుడు అయితే సౌదీ అరేబియా నుండి బహిష్కరించబడతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా రెసిడెన్సీ, పని, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను తెలిపాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







