రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..
- August 17, 2022రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూల్ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.
గతంతో పోలిస్తే కొత్త ఎఫ్టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్ల సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. 2019-23 ఎఫ్టీపీలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. ఐసీసీ 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేళ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి.
మొత్తంగా నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సైకిల్లో పురుషుల క్రికెట్ జట్లు 87 మ్యాచ్లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా జరుగనున్నాయి.
భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లతో టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత