ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష
- August 19, 2022
దుబాయ్: ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురిని దుబాయ్ దుర్వినియోగాలు, ఉల్లంఘనల కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒక ఆసియన్ షిప్ కెప్టెన్(43), మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నిందితులకు ఒక నెల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాల ఉద్యోగ సస్పెన్షన్ను కోర్టు విధించింది. ప్రమాదంలో ఓడకు జరిగిన నష్టానికి Dh100,000 జరిమానా విధించింది. దీనితోపాటు వారి కేసును దుబాయ్ సివిల్ కోర్టుకు రిఫర్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జెబెల్ అలీ పోర్ట్లోని ఓడలో మంటలు చెలరేగి 24 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని కోర్టు పేర్కొంది. గతేడాది జూలైలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్లోని ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్దేశించిన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







