ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష
- August 19, 2022
దుబాయ్: ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురిని దుబాయ్ దుర్వినియోగాలు, ఉల్లంఘనల కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒక ఆసియన్ షిప్ కెప్టెన్(43), మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నిందితులకు ఒక నెల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాల ఉద్యోగ సస్పెన్షన్ను కోర్టు విధించింది. ప్రమాదంలో ఓడకు జరిగిన నష్టానికి Dh100,000 జరిమానా విధించింది. దీనితోపాటు వారి కేసును దుబాయ్ సివిల్ కోర్టుకు రిఫర్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జెబెల్ అలీ పోర్ట్లోని ఓడలో మంటలు చెలరేగి 24 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని కోర్టు పేర్కొంది. గతేడాది జూలైలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్లోని ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్దేశించిన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







