ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురికి జైలు శిక్ష
- August 19, 2022
దుబాయ్: ఓడలో అగ్నిప్రమాదానికి కారణమైన ఐదుగురిని దుబాయ్ దుర్వినియోగాలు, ఉల్లంఘనల కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో ఒక ఆసియన్ షిప్ కెప్టెన్(43), మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నిందితులకు ఒక నెల జైలు శిక్షతోపాటు మూడు సంవత్సరాల ఉద్యోగ సస్పెన్షన్ను కోర్టు విధించింది. ప్రమాదంలో ఓడకు జరిగిన నష్టానికి Dh100,000 జరిమానా విధించింది. దీనితోపాటు వారి కేసును దుబాయ్ సివిల్ కోర్టుకు రిఫర్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జెబెల్ అలీ పోర్ట్లోని ఓడలో మంటలు చెలరేగి 24 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని కోర్టు పేర్కొంది. గతేడాది జూలైలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్లోని ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్దేశించిన భద్రతా చర్యలను పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







