లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు!

- September 04, 2022 , by Maagulf
లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు!

అబుధాబి: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం.కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి.ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు.అయితే ఊహించని విధంగా ఓ ఫ్రెంచి వ్యక్తికి రెండోసారే అబుధాబి బిక్ టికెట్ ర్యాఫిల్ లో భారీ జాక్ పాట్ కొట్టాడు.ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ఇలా అదృష్టం వరించడంతో ఫ్రెంచ్‌కు చెందిన సెలిన్ జాసిన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో ఉండే సెలిన్ జాసిన్ ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 13న అబుధాబి బిగ్‌టికెట్‌ ర్యాఫిల్ లో నం. 176528 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 

ఇది అతడు కొనుగోలు చేసిన రెండో టికెటే కావడం గమనార్హం.శనివారం అబుధాబి ఎయిర్‌పోర్టులో నిర్వహించిన డ్రాలో సెలిన్ జాసిన్ కొన్న ఈ టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది.దాంతో విజేతగా నిలిచిన అతడు 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ముందుగా ఈ వార్తా తాను నమ్మలేదని, బిగ్‌ టికెట్ లాటరీ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయానని ఆనందం వ్యక్తం చేశాడు.కాగా, బిగ్ టికెట్ ర్యాఫిల్ గెలిచి తొలి ఫ్రెంచ్ వ్యక్తి సెలిన్ జాసినే. ఇక ఇదే డ్రాలో భారత్‌కు చెందిన జయకుమార్ వాసుపిళ్లై అనే వ్యక్తి 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.మరో భారత వ్యక్తి అజయ్ భాటియా కూడా కోటి రూపాయలు విలువ చేసే మసెరటి ఘిబ్లీ హైబ్రిడ్ జీటీ అనే కాస్ట్లీ కారు గెలుచుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com