చెన్నైలో శోభన్ బాబు విగ్రహం వద్ద భారీ పోలీసు భద్రత
- June 15, 2015
చెన్నైలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు విగ్రహన్ని కూల్చేస్తామన్న తమిళ మున్నేట్ర పడై సంస్ధ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే శోభన్ బాబు విగ్రహం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నాగపట్నంలో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇటీవల తమిళ గ్రూపులు ప్రయత్నం చేశాయి. భారతదేశంలో నిషేధిత తీవ్రవాద సంస్ధ ఆయిన ఎల్టీటీఈ చీఫ్ విగ్రహం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. అంతేకాదు ఏర్పాటు చేయాలనుకున్న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ విగ్రహన్ని కూడా తీసేయించారు. ఈ చర్యను ఆగ్రహించిన తమిళ వేర్పాటువాద గ్రూపులు తమిళ ఉద్యమ నేత విగ్రహం ఏర్పాటును ప్రభుత్వం సంకుచిత ధోరణితో అడ్డుకుంటుందని ఆరోపించాయి. మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహలు రాజధానిలో ఉండటం ఎంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించాయి. శోభన్ బాబు విగ్రహం వద్ద నిరసన చేయాలని వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







