చెన్నైలో శోభన్ బాబు విగ్రహం వద్ద భారీ పోలీసు భద్రత
- June 15, 2015
చెన్నైలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు విగ్రహన్ని కూల్చేస్తామన్న తమిళ మున్నేట్ర పడై సంస్ధ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే శోభన్ బాబు విగ్రహం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నాగపట్నంలో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇటీవల తమిళ గ్రూపులు ప్రయత్నం చేశాయి. భారతదేశంలో నిషేధిత తీవ్రవాద సంస్ధ ఆయిన ఎల్టీటీఈ చీఫ్ విగ్రహం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. అంతేకాదు ఏర్పాటు చేయాలనుకున్న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ విగ్రహన్ని కూడా తీసేయించారు. ఈ చర్యను ఆగ్రహించిన తమిళ వేర్పాటువాద గ్రూపులు తమిళ ఉద్యమ నేత విగ్రహం ఏర్పాటును ప్రభుత్వం సంకుచిత ధోరణితో అడ్డుకుంటుందని ఆరోపించాయి. మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహలు రాజధానిలో ఉండటం ఎంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించాయి. శోభన్ బాబు విగ్రహం వద్ద నిరసన చేయాలని వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







