డ్రగ్ నెట్వర్క్లపై మరిన్ని దాడులు: సౌదీ కేబినెట్
- September 07, 2022
జెడ్డా: మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్లను అడ్డుకోవడంలో స్థానిక భద్రతా అధికారుల పనితీరును సౌదీ అరేబియా ప్రశంసించింది. మంగళవారం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో కింగ్ సల్మాన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఇటీవల సౌదీ అధికారులు దాదాపు 47 మిలియన్ల యాంఫేటమిన్ మాత్రల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీని వీధి విలువ $1 బిలియన్ వరకు ఉంటుంది. ఈ కేసులో ఆరుగురు సిరియన్లు, ఇద్దరు పాకిస్థానీలను అధికారులు అరెస్టు చేశారు. అధికారుల పనితీరును ప్రశసించిన కేబినెట్.. మాదకద్రవ్యాల నెట్ వర్క్ లపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని దాడులు చేయాలని భద్రతాధికారులకు సూచించింది. అలాగే ఇంధన సరఫరాలను లక్ష్యంగా సరిహద్దు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా వేగంగా స్పందించే రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని అంతర్జాతీయ సమాజానికి కేబినెట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







