డ్రగ్ నెట్వర్క్లపై మరిన్ని దాడులు: సౌదీ కేబినెట్
- September 07, 2022
జెడ్డా: మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్లను అడ్డుకోవడంలో స్థానిక భద్రతా అధికారుల పనితీరును సౌదీ అరేబియా ప్రశంసించింది. మంగళవారం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్లో కింగ్ సల్మాన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఇటీవల సౌదీ అధికారులు దాదాపు 47 మిలియన్ల యాంఫేటమిన్ మాత్రల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీని వీధి విలువ $1 బిలియన్ వరకు ఉంటుంది. ఈ కేసులో ఆరుగురు సిరియన్లు, ఇద్దరు పాకిస్థానీలను అధికారులు అరెస్టు చేశారు. అధికారుల పనితీరును ప్రశసించిన కేబినెట్.. మాదకద్రవ్యాల నెట్ వర్క్ లపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని దాడులు చేయాలని భద్రతాధికారులకు సూచించింది. అలాగే ఇంధన సరఫరాలను లక్ష్యంగా సరిహద్దు ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా వేగంగా స్పందించే రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని అంతర్జాతీయ సమాజానికి కేబినెట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!
- ఒమన్ లో ఆసియా జాతీయులు అరెస్టు..!!
- రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!









