ముగిసిన ఏపీ కేబినెట్…
- September 07, 2022
అమరావతి: ఏపీ సిఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపుగా రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో జగన్ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో అదనంగా 85 పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న చేయూత నిదుల విడుదలకు ఆమోదం తెలిపింది. భావనపాడు పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్… దివ్యాంగులకు ఉద్యోగాలు, ప్రమోషన్లలో 4 శాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చ జెండా ఊపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!