ముగిసిన ఏపీ కేబినెట్…
- September 07, 2022
అమరావతి: ఏపీ సిఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపుగా రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో జగన్ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో అదనంగా 85 పోస్టులను ప్రమోషన్ల ఆధారంగా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న చేయూత నిదుల విడుదలకు ఆమోదం తెలిపింది. భావనపాడు పోర్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్… దివ్యాంగులకు ఉద్యోగాలు, ప్రమోషన్లలో 4 శాతం రిజర్వేషన్ల అమలుకు పచ్చ జెండా ఊపింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







