కార్మికుల బహిష్కరణ వార్తలను ఖండించిన యూఏఈ
- September 10, 2022
యూఏఈ: ఆఫ్రికన్ దేశాలకు చెందిన కొంతమంది కార్మికులను బహిష్కరించడంపై మీడియా రిపోర్టింగ్లకు సంబంధించిన ఆరోపణలు అవాస్తవమని యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖలోని మానవ హక్కుల విభాగం డైరెక్టర్ సయీద్ అల్ హెబ్సీ ఖండించారు. మీడియాలో చూపుతున్న నివేదికలు పాతవని పేర్కొన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ హ్యూమన్ రైట్స్ పాలసీస్ ప్రచురించిన నివేదికను మీడియాలో తప్పుగా చూపుతున్నారన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గతంలో 2021లో ప్రచురించిన నివేదికలను మీడియాలో చూపుతున్నారని అల్ హెబ్సీ అన్నారు. వివిధ ఉల్లంఘనల్లో అరెస్టయిన కార్మికులపై చట్టపరమైన విధానాలలో దేశ బహిష్కరణ జరిగిందని, ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని అల్ హెబ్సీ పేర్కొన్నారు. కార్మిక విధానాల్లో యూఏఈ పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారుల అధికారిక ప్రకటనలను ప్రస్తావించాలని మీడియాను అల్ హెబ్సీ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!