ఆపన్నులకు అండగా కింగ్స్ గ్రాంట్
- June 15, 2015
కింగ్ హమాద్, రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలకు రమదాన్ సందర్భంగా ‘గ్రాంట్’ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్కి షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో, పేద కుటుంబాలకు ఈ గ్రాంట్ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్న కింగ్ హమాద్కి ఈ సందర్భంగా షేక్ నాజర్ కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో అనాధలకూ, భర్తలను కోల్పోయిన మహిళలకు అండదండలు అందించాలనే ఆలోచన చాలా గొప్పదని షేక్ నాజర్ అన్నారు. రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్లో నిర్వహిస్తామని చెప్పారాయన.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









