అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ అందించటమే లక్ష్యంగా ఖతార్ కృషి చేస్తోంది-ఎడ్యుకేషన్ మినిస్టర్
- September 18, 2022
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సరైన విద్య, వైద్యం అందాలన్నదే ఖతార్ లక్ష్యమని ఆ దేశ ఉన్నత విద్యాశాఖ మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. ఇందుకోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్, ఎడ్యుకేషన్ తో పాటు పేదలకు ఆర్థికంగా సాయంగా ఉండే పెద్ద ప్రాజెక్ట్ లలో తమ దేశం పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. శనివారం న్యూయార్క్లోని UN ప్రధాన కార్యాలయంలో జరిగిన "ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్" సమ్మిట్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం, పేదలకు ఆర్థిక సాయం కోసం ఖతార్ ఫండ్ ద్వారా దాదాపు 64 దేశాల్లో ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేశామని చెప్పారు. దీని ద్వారా 60 దేశాల్లోని కోటి మంది బడి మానేసిన విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. అదే విధంగా కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన చాలా మంది తల్లితండ్రులకు సాయం అందించేందుకు బ్యాంక్ స్థాపించామన్నారు. దీని 17 దేశాల్లో విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు తమవంతు కృషి చేశాని చెప్పారు. ఎడ్యుకేషన్ అబౌ ఆల్ ఫౌండేషన్, హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాసర్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిచాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఖతార్ ప్రభుత్వం తమ వంతు ప్రయాతం చేస్తుందన్నారు. విద్యా ద్వారా ప్రతి వ్యక్తి, సమాజంలోనూ మార్పు సాధ్యమవుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







