భారత్ కరోనా అప్డేట్

- September 18, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉన్నట్లు చెప్పింది.వారాంతపు పాజిటివిటీ రేటు 1.79 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,57,929గా ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య మొత్తం 216.56 కోట్లు అని పేర్కొంది. వాటిలో రెండో డోసులు 94.65 కోట్లు, బూస్టర్ డోసులు 19.48 కోట్లు ఉన్నట్లు చెప్పింది. నిన్న 14,84,216 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 89.15 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. నిన్న 2,89,228 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com