మిధాని సంస్థ పై సైబర్ అటాక్..

- September 20, 2022 , by Maagulf
మిధాని  సంస్థ పై సైబర్ అటాక్..

హైదరాబాద్: హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు. కెనడా నేషనల్ ఆల్ కంపెనీ నుంచి మిధాని సంస్థ.. అల్యూమినియం కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. అమెరికా అకౌంట్ నెంబర్ ను ఈ-మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపారు.

సైబర్ చీటర్స్ పంపిన అమెరికా అకౌంట్ కు మిగతా డబ్బును మిధాని సంస్థ పంపింది. అయితే, తమ మిగతా డబ్బు చెల్లించాలని కెనడా నేషనల్ ఆల్ కంపెనీ మిధాని సంస్థను అడిగింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మిధాని సంస్థ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com