కొత్త నిబంధనలతో హోమ్ డెలివరీ కంపెనీలకు ఇబ్బందులు
- September 29, 2022
కువైట్: హోమ్ డెలివరీ సెక్టార్లోని కార్మికులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ విధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉండగానే.. ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కంపెనీల అధికారులు, రెస్టారెంట్ యజమానులు, తమ కంపెనీల విధానాలను సరిచేయడానికి, ప్రత్యేకించి డెలివరీ చేసే వారికి హెల్త్ కార్డుల అమలు గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక డెలివరీ కంపెనీలు మంత్రిత్వ శాఖ విధించిన కొత్త నిబంధనలకు మారేందుకు సమయం సరిపోదని చెబుతున్నాయి. డెలివరీ కంపెనీల సమాఖ్య అధిపతి ఇబ్రహీం అల్-తువైజ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే శనివారం నాటికి కొత్త నిబంధనలు అమల్లోకి తేవడం కష్టమన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో డెలివరీ కంపెనీలు పనిని నిలిపివేసే యోచనలో ఉన్నాయన్నారు. కువైట్ మునిసిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ న్యూట్రిషన్, ఇతర అధికారిక అధికారుల నుంచి ఫుడ్ డెలివరీ ఉద్యోగుల హెల్త్ కార్డ్ పొందడానికి కనీసం 3 వారాల నుండి ఒక నెల వరకు సమయం పడుతుందన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకులలో ఇది ఒకటన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం వరకు నిర్ణయం అమలును వాయిదా వేస్తే బాగుంటుందన్నారు. ఫుడ్ డెలివరీ రంగంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్నందున, కొత్త చట్టం అమలును వాయిదా వేయాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







