కొత్త నిబంధనలతో హోమ్ డెలివరీ కంపెనీలకు ఇబ్బందులు
- September 29, 2022
కువైట్: హోమ్ డెలివరీ సెక్టార్లోని కార్మికులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ విధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉండగానే.. ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కంపెనీల అధికారులు, రెస్టారెంట్ యజమానులు, తమ కంపెనీల విధానాలను సరిచేయడానికి, ప్రత్యేకించి డెలివరీ చేసే వారికి హెల్త్ కార్డుల అమలు గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక డెలివరీ కంపెనీలు మంత్రిత్వ శాఖ విధించిన కొత్త నిబంధనలకు మారేందుకు సమయం సరిపోదని చెబుతున్నాయి. డెలివరీ కంపెనీల సమాఖ్య అధిపతి ఇబ్రహీం అల్-తువైజ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే శనివారం నాటికి కొత్త నిబంధనలు అమల్లోకి తేవడం కష్టమన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో డెలివరీ కంపెనీలు పనిని నిలిపివేసే యోచనలో ఉన్నాయన్నారు. కువైట్ మునిసిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ న్యూట్రిషన్, ఇతర అధికారిక అధికారుల నుంచి ఫుడ్ డెలివరీ ఉద్యోగుల హెల్త్ కార్డ్ పొందడానికి కనీసం 3 వారాల నుండి ఒక నెల వరకు సమయం పడుతుందన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకులలో ఇది ఒకటన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం వరకు నిర్ణయం అమలును వాయిదా వేస్తే బాగుంటుందన్నారు. ఫుడ్ డెలివరీ రంగంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉన్నందున, కొత్త చట్టం అమలును వాయిదా వేయాలని కోరారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







