వేములవాడలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టి.గవర్నర్ తమిళిసై
- October 02, 2022
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో రాజకీయ నేతలు సైతం ఉత్సహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శనివారం గవర్నర్ తమిళిసై రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా దర్శించుకోవడం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి… ఆలయ అభివృద్ధి కోసం నా వంతు నేను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు వేములవాడకు రావడం, వేలాది మంది మహిళలతో ఉత్సవాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే వేలాది మంది మహిళలతో రాజ్భవన్లో బతుకమ్మ ఆడామని అంటూ రాష్ట్ర ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







