భారత్ కరోనా అప్డేట్
- October 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గడిచిన 24గంటల్లో కొత్తగా 1968 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి తాజాగా 3,481 మంది కోలుకోగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 34,598కి చేరాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94శాతంగా ఉందని, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతంగా ఉందని వివరించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,45,99,466కు పెరగ్గా.. మొత్తం 4,40,36,152 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో 5,28,716 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో 218.80కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







