ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలి: బహ్రెయిన్
- October 12, 2022
మనామా: కొవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకోవడానికి ప్రతిఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లోని మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ హలా అల్-జాసిమ్ పిలుపునిచ్చారు. పౌరులు, నివాసితులందరికీ రెండు డోసులు ఉచితంగా అందించబడుతుందన్నారు. కరొనా వైరస్ బారి నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://www.healthalert.gov.bh లేదా బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్ ద్వారా లేదా 444కు కాల్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అల్-జాసిమ్ పేర్కొన్నారు. మొదటి డోస్ తీసుకున్న తేదీ నుండి 21 రోజుల తర్వాత తప్పనిసరిగా రెండవ డోస్ తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







