ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలి: బహ్రెయిన్
- October 12, 2022
మనామా: కొవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకోవడానికి ప్రతిఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లోని మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ హలా అల్-జాసిమ్ పిలుపునిచ్చారు. పౌరులు, నివాసితులందరికీ రెండు డోసులు ఉచితంగా అందించబడుతుందన్నారు. కరొనా వైరస్ బారి నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://www.healthalert.gov.bh లేదా బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్ ద్వారా లేదా 444కు కాల్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అల్-జాసిమ్ పేర్కొన్నారు. మొదటి డోస్ తీసుకున్న తేదీ నుండి 21 రోజుల తర్వాత తప్పనిసరిగా రెండవ డోస్ తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!
- నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- ఒమన్లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్లపై ఆంక్షలు..!!
- నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం..
- విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్లు ప్రారంభం..
- దుబాయ్లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- కువైట్లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్







