నర్సరీ పిల్లలపై దాడి చేసినందుకు మూడేళ్లు జైలుశిక్ష, బహిష్కరణ

- October 12, 2022 , by Maagulf
నర్సరీ పిల్లలపై దాడి చేసినందుకు మూడేళ్లు జైలుశిక్ష, బహిష్కరణ

మనామా: ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఓ ప్రవాస మహిళకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి భహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నర్సరీ ఉద్యోగి పిల్లవాడిని కొట్టిన వీడియోను మరొక ఉద్యోగి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని సమీక్షించింది. పిల్లలపై దాడికి పాల్పడ్డ ఉద్యోగులను అరెస్టు చేయాలని ఆదేశించింది. పర్మిట్ లేకుండా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు BHD100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com