నర్సరీ పిల్లలపై దాడి చేసినందుకు మూడేళ్లు జైలుశిక్ష, బహిష్కరణ
- October 12, 2022
మనామా: ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై దాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఓ ప్రవాస మహిళకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతోపాటు జైలుశిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి భహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నర్సరీ ఉద్యోగి పిల్లవాడిని కొట్టిన వీడియోను మరొక ఉద్యోగి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని సమీక్షించింది. పిల్లలపై దాడికి పాల్పడ్డ ఉద్యోగులను అరెస్టు చేయాలని ఆదేశించింది. పర్మిట్ లేకుండా పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు BHD100 జరిమానా విధించారు. శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









