BD42,000 ఫోన్ స్కామ్.. ముఠా అరెస్ట్
- October 16, 2022
బహ్రెయిన్: BD42,000 విలువైన ఫోన్ స్కామ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ముఠా బ్యాంకు ఖతాలను స్తంభింపచేసి సొమ్ము రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఒక ఫోన్ కాల్ తర్వాత అతని బ్యాంక్ ఖాతా నుండి BD11,000 కోల్పోయిన పౌరుడి ఫిర్యాదును విచారించగా.. ఆసియా జాతీయుల ముఠాను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిఘా అధికారులు బ్యాంకులతో సమన్వయంతో ముఠా లావాదేవీలను, వారి లబ్ధిదారులను ట్రాక్ చేయగలిగారన్నారు. నిందితులు మోసానికి ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురిని ట్రాప్ చేసి వారి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును నిందితులు స్వాహా చేసినట్లు డైరెక్టర్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు