సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, విరామం తప్పనిసరి
- October 20, 2022
రియాద్: సెక్యూరిటీ గార్డుల నియామకం, నిబంధనలు, కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన కొత్త నిబంధనలు, షరతులను ఆమోదించినట్లు సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి ఇంజి. అహ్మద్ అల్-రజ్హీ వెల్లడించారు. తాజా నిబంధనలు, షరతుల ప్రకారం.. సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, ప్రార్థన, ఆహారం కోసం విరామం తప్పనిసరి అని.. ఏకధాటిగా ఐదు గంటల పాటు పని చేయించడం నేరమని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సెక్యూరిటీ గార్డులకు యూనిఫారాలు, ఎండ తగులకుండా అవసరమైన సౌకర్యాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోసం విధానపరమైన మాన్యువల్లో పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకునే అన్ని రకాల సంస్థలకు, కంపెనీలకు కొత్త నిబంధనలు, షరతులు వర్తిస్తాయని తాజా ఉత్తర్వుల్లో అహ్మద్ అల్-రజ్హీ తెలియజేశారు. సెక్యూరిటీ గార్డుల విభాగంలో పని నాణ్యతను పెంపొందించడం, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలలో కార్మికుల స్థిరత్వాన్ని తాజా నిర్ణయం ముఖ్య ఉద్దేశం అన్నారు. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రచురించిన తేదీ నుండి 180 రోజులకు మించకుండా ఈ నిబంధనలను పాటించాలని సంబంధిత ప్రైవేట్ రంగ సంస్థలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







