సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, విరామం తప్పనిసరి
- October 20, 2022
రియాద్: సెక్యూరిటీ గార్డుల నియామకం, నిబంధనలు, కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించిన కొత్త నిబంధనలు, షరతులను ఆమోదించినట్లు సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి ఇంజి. అహ్మద్ అల్-రజ్హీ వెల్లడించారు. తాజా నిబంధనలు, షరతుల ప్రకారం.. సెక్యూరిటీ గార్డులకు విశ్రాంతి, ప్రార్థన, ఆహారం కోసం విరామం తప్పనిసరి అని.. ఏకధాటిగా ఐదు గంటల పాటు పని చేయించడం నేరమని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సెక్యూరిటీ గార్డులకు యూనిఫారాలు, ఎండ తగులకుండా అవసరమైన సౌకర్యాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోసం విధానపరమైన మాన్యువల్లో పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకునే అన్ని రకాల సంస్థలకు, కంపెనీలకు కొత్త నిబంధనలు, షరతులు వర్తిస్తాయని తాజా ఉత్తర్వుల్లో అహ్మద్ అల్-రజ్హీ తెలియజేశారు. సెక్యూరిటీ గార్డుల విభాగంలో పని నాణ్యతను పెంపొందించడం, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలలో కార్మికుల స్థిరత్వాన్ని తాజా నిర్ణయం ముఖ్య ఉద్దేశం అన్నారు. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రచురించిన తేదీ నుండి 180 రోజులకు మించకుండా ఈ నిబంధనలను పాటించాలని సంబంధిత ప్రైవేట్ రంగ సంస్థలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







