డ్రగ్స్ వినియోగం, పంపిణీ: 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా
- October 26, 2022
దుబాయ్: మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు, ఉపయోగించడంతోపాటు వాటిని ఇతరులకు పంపిణీ చేసినందుకు 43 ఏళ్ల అరబ్ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, Dh 50,000 జరిమానాను దుబాయ్ క్రిమినల్ కోర్ట్ విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత మే నెలలో నిందితుడు సిలికాన్ ఒయాసిస్ ప్రాంతంలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడని, వాడుతున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నార్కోటిక్ అధికారులు దాడి చేసి నిందితుడితోపాటు మరికొందరిని, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గంజాయిని వాడినట్లు అంగీకరించారు. కేసు ను విచారించిన క్రిమినల్ కోర్ట్.. ప్రధాన నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించింది. మిగతా నిందితులను మాదకద్రవ్యాల దుర్వినియోగం ఆరోపణలపై మిస్డిమీనర్స్ కోర్టుకు రిఫర్ చేశారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







