డ్రగ్స్ వినియోగం, పంపిణీ: 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా
- October 26, 2022
దుబాయ్: మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నందుకు, ఉపయోగించడంతోపాటు వాటిని ఇతరులకు పంపిణీ చేసినందుకు 43 ఏళ్ల అరబ్ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, Dh 50,000 జరిమానాను దుబాయ్ క్రిమినల్ కోర్ట్ విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత మే నెలలో నిందితుడు సిలికాన్ ఒయాసిస్ ప్రాంతంలో మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడని, వాడుతున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నార్కోటిక్ అధికారులు దాడి చేసి నిందితుడితోపాటు మరికొందరిని, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు గంజాయిని వాడినట్లు అంగీకరించారు. కేసు ను విచారించిన క్రిమినల్ కోర్ట్.. ప్రధాన నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించింది. మిగతా నిందితులను మాదకద్రవ్యాల దుర్వినియోగం ఆరోపణలపై మిస్డిమీనర్స్ కోర్టుకు రిఫర్ చేశారు. శిక్షాకాలం ముగిసిన తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









