Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- November 01, 2022
యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కి హాజరయ్యే అభిమానుల నుండి మల్టీ ఎంట్రీ పర్యాటక వీసాల కోసం యూఏఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు హయ్యా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఫుట్ బాల్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ICP వెబ్సైట్లో యూఏఈ మల్టీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రపంచ కప్ అభిమానులు మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో అనేక సార్లు ఎమిరేట్స్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. వీసా రుసుమును వన్-టైమ్ ఛార్జ్ Dh100కి తగ్గించినట్లు వెల్లడించింది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం
- బ్రెజిల్లో భారీ ఆపరేషన్–60 మంది గ్యాంగ్ సభ్యుల హతం
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!







