Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- November 01, 2022
యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కి హాజరయ్యే అభిమానుల నుండి మల్టీ ఎంట్రీ పర్యాటక వీసాల కోసం యూఏఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు హయ్యా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఫుట్ బాల్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ICP వెబ్సైట్లో యూఏఈ మల్టీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రపంచ కప్ అభిమానులు మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో అనేక సార్లు ఎమిరేట్స్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. వీసా రుసుమును వన్-టైమ్ ఛార్జ్ Dh100కి తగ్గించినట్లు వెల్లడించింది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









