Dh100కే యూఏఈ మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- November 01, 2022
యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కి హాజరయ్యే అభిమానుల నుండి మల్టీ ఎంట్రీ పర్యాటక వీసాల కోసం యూఏఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు హయ్యా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ఫుట్ బాల్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ICP వెబ్సైట్లో యూఏఈ మల్టీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రపంచ కప్ అభిమానులు మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో అనేక సార్లు ఎమిరేట్స్లోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. వీసా రుసుమును వన్-టైమ్ ఛార్జ్ Dh100కి తగ్గించినట్లు వెల్లడించింది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులు పొడిగించుకునే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







