700 మహిళా న్యాయవాదులకు కొత్తగా లైసెన్సులు
- November 01, 2022
రియాద్: 700 మహిళా న్యాయవాదులకు న్యాయ మంత్రిత్వ శాఖ కొత్తగా లైసెన్సులను జారీ చేసింది. దీంతో సౌదీలోలైసెన్స్ పొందిన మహిళా న్యాయవాదుల సంఖ్య 2,100కి చేరుకుంది. న్యాయవాదులు, ట్రైనీల కోసం నజీజ్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లేదా న్యాయ సంస్థ సాధారణ పరిపాలన కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు లైసెన్సులు పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నజీజ్ పోర్టల్ లో ట్రైనీ లాయర్ని ఒక లాయర్ నుండి మరొక లాయర్కి బదిలీ చేయడానికి అభ్యర్థనను సమర్పించే అప్షన్ అందుబాటులో ఉందని, అలాగే ట్రైనీ లాయర్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా సులువుగా పొందవచ్చని న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









