700 మహిళా న్యాయవాదులకు కొత్తగా లైసెన్సులు
- November 01, 2022
రియాద్: 700 మహిళా న్యాయవాదులకు న్యాయ మంత్రిత్వ శాఖ కొత్తగా లైసెన్సులను జారీ చేసింది. దీంతో సౌదీలోలైసెన్స్ పొందిన మహిళా న్యాయవాదుల సంఖ్య 2,100కి చేరుకుంది. న్యాయవాదులు, ట్రైనీల కోసం నజీజ్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లేదా న్యాయ సంస్థ సాధారణ పరిపాలన కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు లైసెన్సులు పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నజీజ్ పోర్టల్ లో ట్రైనీ లాయర్ని ఒక లాయర్ నుండి మరొక లాయర్కి బదిలీ చేయడానికి అభ్యర్థనను సమర్పించే అప్షన్ అందుబాటులో ఉందని, అలాగే ట్రైనీ లాయర్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా సులువుగా పొందవచ్చని న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







