700 మహిళా న్యాయవాదులకు కొత్తగా లైసెన్సులు
- November 01, 2022 
            రియాద్: 700 మహిళా న్యాయవాదులకు న్యాయ మంత్రిత్వ శాఖ కొత్తగా లైసెన్సులను జారీ చేసింది. దీంతో సౌదీలోలైసెన్స్ పొందిన మహిళా న్యాయవాదుల సంఖ్య 2,100కి చేరుకుంది. న్యాయవాదులు, ట్రైనీల కోసం నజీజ్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లేదా న్యాయ సంస్థ సాధారణ పరిపాలన కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు లైసెన్సులు పొందవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నజీజ్ పోర్టల్ లో ట్రైనీ లాయర్ని ఒక లాయర్ నుండి మరొక లాయర్కి బదిలీ చేయడానికి అభ్యర్థనను సమర్పించే అప్షన్ అందుబాటులో ఉందని, అలాగే ట్రైనీ లాయర్ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని కూడా ఆన్ లైన్ ద్వారా సులువుగా పొందవచ్చని న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







