వ్యక్తిపై దాడి.. ముగ్గురు వ్యక్తులకు ఏడాది జైలు, Dh3,500 జరిమానా

- November 02, 2022 , by Maagulf
వ్యక్తిపై దాడి.. ముగ్గురు వ్యక్తులకు ఏడాది జైలు, Dh3,500 జరిమానా

దుబాయ్: నైఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేసి 3,500 దిర్హామ్‌లు దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తుల కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా(దొంగతనం చేసిన Dh3,500) విధించింది. నిందితులు శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత డిసెంబర్‌లో జరిగింది. నైఫ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా తనపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఆసియన్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు చెప్పాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు తనపై కత్తులతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.  దుబాయ్ పోలీసుల దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com