వాహనాల వద్ద కొవిడ్-19 పరీక్షలు నిలిపివేత
- November 03, 2022
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) తన ఆరోగ్య కేంద్రాలైన లీబైబ్, అల్ గరాఫా, అల్ రేయాన్, అల్ వాజ్బా, అల్ వక్రాలలో 2022 నవంబర్ 1 నుండి వాహనాల నుండి కొవిడ్-19 పరీక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పీహెచ్సీసీ తెలిపింది. కొవిడ్-19కి వ్యతిరేకంగా జాతీయ టీకా కార్యక్రమాన్ని నిరంతరం అమలు చేయడంతో పాటు ఖతార్తో సహా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల తగ్గింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఖతార్ రాష్ట్రానికి చేరుకున్న తర్వాత పౌరులు, నివాసితుల కోసం వేగవంతమైన యాంటిజెన్ పరీక్ష లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షలను రద్దు చేస్తూ అక్టోబర్ 26 ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







