10 నెలల్లో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు
- November 10, 2022_1668081420.jpg)
యూఏఈ: 2022 జనవరి - అక్టోబర్ మధ్య యూఏఈలో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు అయినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. యూఏఈలో వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో 485,000 తనిఖీలు చేపట్టారని, ఈ సందర్భంగా 26,104 కార్మిక చట్ట ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నది. కార్మిక ఉల్లంఘనలలో వేతనాలు చెల్లించని 2,973 కేసులు నమోదయినట్లు తెలిపింది. ఈ కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఉద్యోగుల పాస్పోర్ట్లను యాజమాన్యాలు వెనక్కు తీసుకున్న 178 కేసుల్లో 132 పరిష్కరించబడ్డాయని తెలిపింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు